టీఆర్ఎస్, బీజీపీపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఫైర్

కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

ఇందులో భాగంగానే సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ చేశారని ఆరోపించారు.

కవితను ఇంటికెళ్లి ఎందుకు విచారణ చేయాలి అని ప్రశ్నించారు.కవితను మాత్రం సీబీఐ ఆఫీస్ కు ఎందుకు పిలవడం లేదని నిలదీశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్య కాస్ట్ లీ అయిపోయిందని విమర్శించారు.నాలుగు ఫ్లైఓవర్లు, రెండు రోడ్లు వేస్తే అభివృద్ధా అని ప్రశ్నించారు.

గెలిచిన వారిని పార్టీలో చేర్చుకుని టీఆర్ఎస్ బలం అనుకుంటుందన్నారు.కార్యకర్తలు కోరుకున్న అభ్యర్థికే టిక్కెట్ అని ఆయన వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కు ప్రాధాన్యత తగ్గిందనే ప్రశ్న.. జక్కన్న రియాక్షన్ ఇదే!