తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎస్టి రిజర్వేషన్ల అమలు ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు.

గత ఎనిమిది ఏళ్లుగా ఎస్టీలందరూ నష్టపోయారని చెప్పారు.ఇన్నేళ్లుగా కేంద్రంపై నెపం నెట్టి కేసీఆర్ కాలయాపన చేశారని మండిపడ్డారు.

గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసారని అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గిరిజనులు కోల్పోయిన నాలుగు శాతం పోస్టులను భర్తీ చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ వలనే తెలంగాణకు అన్యాయం..: కిషన్ రెడ్డి