ఓటమి భయంతో కాంగ్రెస్ నీచ రాజకీయాలు..: బండి సంజయ్

ఓటమి భయంతో కాంగ్రెస్( Congress ) నీచానికి దిగజారుతోందని బీజేపీ నేత బండి సంజయ్( Bandi Sanjay ) అన్నారు.

ఫేక్ వీడియోలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియదని బండి సంజయ్ విమర్శించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) వ్యవహారశైలిని చూసి కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తుతున్నారని చెప్పారు.

ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతోమంది మాదిగలు బలయ్యారని తెలిపారు.మాదిగ సమాజంపై అవాకులు పేలుతున్న మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

నాగబాబు ట్వీట్ పై స్పందించిన శిల్పా రవి.. ఏమన్నారంటే?