మర్రి చెన్నారెడ్డి 103 వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు..

మాజీ సిఎం, మాజీ గవర్నర్ చెన్నారెడ్డి 103 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ మర్రి చెన్నారెడ్డి రాక్ గార్డెన్ లో ఆయన సమాధి వద్ద పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు అంజన్ కుమార్ యాదవ్ మహేష్ గౌడ్ , మాజీ ఎంపీ వి.

హనుమంతరావు హాజరై నివాళులర్పించారు.వేడుకల్లో పాల్గొని నివాళులు అర్పించిన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, పిసిసీ కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చిన్నారెడ్డి హాజరై నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం మర్రి చెన్నారెడ్డి చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు.

నిరుద్యోగ యువత, మహిళలను కూడగట్టుకొని మంచి పరిపాలన పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోందనీ అన్నారు.

యూపీలో ప్రియాంక గాంధీ మహిళలకు 40శాతం సీట్లు కేటాయించడంతో మహిళల పట్ల కాంగ్రెస్ కు ఉన్న చిత్తశుద్ధి స్పష్టమవుతోందన్నారు.

మంగళగిరిలో టీడీపీ రౌడీ రాజకీయం..!!