బ్యాంక్ మేనేజర్ కు స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు, ఐకెపి సిఎలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట లో గల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కు ఇటీవల బ్రాంచ్ మేనేజర్ గా మెట్ పల్లి నుండి బదిలీ పై వచ్చిన శ్రావణ లక్ష్మి నీ స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ( Oggu Balraj Yadav )ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేటకు చెందిన సిఏ లు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేసిన పి సురేష్ బాబు హైదారాబాద్ కు బదిలీ పై వెళ్లగా ఆయన స్థానంలో శ్రావణ లక్ష్మి బదిలీ పై ఇక్కడికి వచ్చారు.

ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ గా మెట్ పల్లి నుండి బదిలీ పై వచ్చిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

బ్యాంక్ ప్రారంభం అయినప్పటి నుండి తొలి మహిళా మేనేజర్ కావడం విశేషం.ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట కాంగ్రెస్ నాయకులు పుల్లయ్య గారి తిరుపతి గౌడ్,ఐకెపి సిఎ లు పంతులూరి వాణిశ్రీ, రేణుక, గాజుల లావణ్య లు ఉన్నారు.

ఆ హిట్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్.. వరుస ఫ్లాపులకు బ్రేక్ పడినట్లేనా?