టికెట్ కేటాయించకపోయినా సూర్యాపేట అభ్యర్థిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ నేత..!

కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకపోయినా ఓ నేత నామినేషన్ దాఖలు చేశారు.సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని దామోదర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ అధిష్టానంపై నమ్మకంతోనే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు.పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే సూర్యాపేట, తుంగతుర్తితో పాటు పాలేరు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు.

టి. బిజేపి లో ఏం జరుగుతోంది ? నడ్డా టూర్ కి కారణం ఏంటి ?