జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ వ్యతిరేకం..: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే గెలుపని తెలిపారు.జమిలి ఎన్నికలకు కాంగ్రెస్ వ్యతిరేకమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఓటమి భయంతోనే వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అంశం తెరపైకి తెచ్చారని తెలిపారు.

జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిందన్నారు.వన్ నేషన్ - వన్ ఎలక్షన్ తో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి పోతుందని తెలిపారు.

ఈ క్రమంలో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం పొంచి ఉందని వెల్లడించారు.అధికారాన్ని కోల్పోవద్దని కేంద్రం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు.

కాగా ఇండియా కూటమి జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధి భార్య మన భారత సంతతి వ్యక్తే.. ఎవరీ ఉషా చిలుకూరి..?