సిద్ధాంతంపై నడుస్తున్న పార్టీ కాంగ్రెస్..: సీఎల్పీ నేత భట్టి

తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.నీళ్లు, నిధులు, నియామకాలు ఏమి నెరవేరలేదన్నారు.

సీతారామ సాగర్ ప్రాజెక్టును అశాస్త్రీయంగా నిర్మిస్తున్నారని విమర్శించారు.పాదయాత్రలో ప్రజల నుంచి ఎన్నో సమస్యలను విన్నానన్న భట్టి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని తెలిపారు.

తమ పార్టీ వ్యక్తుల మీద కాదని, సిద్ధాంతంపై నడుస్తోందని పేర్కొన్నారు.టికెట్ల ప్రకటన ఎప్పుడనేది అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు.

ఈ మేరకు సర్వేలు చేసి పార్టీ హైకమాండ్ టికెట్స్ ను ఖరారు చేస్తుందని తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 19, శుక్రవారం 2024