తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ స్పెషల్ ఫోకస్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది.

ఇందులో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు.

ఈ మేరకు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్న డీకే శివకుమార్ రేపు సాయంత్రం వరకు తెలంగాణలోనే ఉండనున్నారు.

ఫలితాల నేపథ్యంలో అవసరం అయితే ఎమ్మెల్యేలను క్యాంప్ లకు తరలించాలని కాంగ్రెస్ భావిస్తోందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ప్రతి అభ్యర్థి వెంటన ఏఐసీసీ పరిశీలకులు ఉండనున్నారు.అలాగే రేపు జరిగే ఎన్నికల కౌంటింగ్ ను డీకే శివకుమార్ పరిశీలించనున్నారు.

మరోవైపు అభ్యర్థులు అంతా అలర్ట్ గా ఉండాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

బింబిసార 2 కి దర్శకుడు ఎవరో తెలుసా..?