కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీతో కాలయాపన చేస్తుంది

రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో కాలయాపన చేస్తూ రైతులను నట్టేట ముంచుతుందని రుణమాఫీ పేరుతో కాలయాపన చేస్తూ రైతుబంధు ఇప్పటివరకు రైతులకు జమ చేయలేదని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడపల్లి బాబు ఎద్దేవా చేశారు.

బోయినపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు ఎడపల్లి బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి మాత్రమే ఏసంగిలో రైతుబంధు చేసిందని కానీ చాలామంది రైతులకు ఎసంగి పంట తో వర్షాకాలం పంటకు ఇప్పటివరకు రైతుబంధు జమ చేయకపోవడం బాధాకరమని అన్నారు.

పెట్టుబడి పెట్టడానికి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ రైతు రుణమాఫీ పేరుతో కాలయాపన చేస్తూ రైతు బంధును మర్చిపోయిందని అన్నారు.

ఇప్పటికైనా రైతుల బాధలను దృష్టిలో పెట్టుకొని రైతుబంధు వేసి పెట్టుబడికి సాయం చేయాలని అన్నారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాంటి పెళ్లిళ్లకు మాత్రమే నేను వెళ్తా.. అంబానీ ఇంట పెళ్లిపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు!