కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొట్టాలి..: మంత్రి హరీశ్ రావు
TeluguStop.com
కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొట్టాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ నేతలకు తెలివి ఉందా అని ప్రశ్నించారు.
గతంలో పగటిపూట తొమ్మిది గంటల కరెంట్ కాంగ్రెస్ ఏనాడైనా ఇచ్చిందా అని నిలదీశారు.
వ్యవసాయం దండగన్న చంద్రబాబు వారసుడే ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
మూడు గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ ను పాతాళంలో పాతి పెట్టాలని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ వాళ్లు పొలిమేర వరకు తరిమికొట్టాలని సూచించారు.
కూతురి ఛాన్స్ మిస్సైంది.. చెల్లిగా నటించింది.. చిరు మూవీ ఛాన్స్ మిస్సైన నటి ఎవరంటే?