Congress : కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు..!
TeluguStop.com
నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలోని ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు( BRS Counsilors ) పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ( Congress Party ) సీనియర్ నాయకులు,మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
ఒకటో వార్డ్ కౌన్సిలర్ రామావత్ మంగుతా నాయక్, మూడో వార్డు కౌన్సిలర్ నాగ శిరీష బీఆర్ఎస్ కు రాజీనామా చేసినవారిలో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లింగారెడ్డి,శంకర్ నాయక్, 9వ వార్డ్ కౌన్సిలర్ రామకృష్ణ,ఆదాసు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!