కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర ప్రారంభం

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ త‌ల‌పెట్టిన భార‌త్ జోడో యాత్ర ప్రారంభం అయింది.

క‌న్యాకుమారిలో మ‌హాత్మాగాంధీ మండపం నుండి ఈ పాద‌యాత్ర‌ను రాహుల్ గాంధీ ప్రారంభించారు.ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు, రాజ‌స్థాన్, ఛ‌త్తీస్ ఘ‌డ్ ముఖ్య‌మంత్రులు ఖాదీ జాతీయ ప‌తాకాన్ని రాహుల్ గాంధీకి అందించారు.

అదేవిధంగా బీచ్ రోడ్డు వ‌ర‌కు జోడో యాత్రీల‌తో మార్చ్ నిర్వ‌హించారు.రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర 12 రాష్ట్రాల మీదుగా 3,500 కిలోమీట‌ర్ల మేర కొన‌సాగ‌నుంది.

ప్ర‌తిరోజు 23 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేయ‌నుండగా.రాహుల్ వెంట 118 మంది నేత‌లు పాల్గొన్నారు.

కాగా ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో హాజ‌రైయ్యారు.