సూర్యాపేటలో ఫలించిన కాంగ్రెస్ బుజ్జగింపులు..వెనక్కి తగ్గిన రెబల్ అభ్యర్థి

సూర్యాపేటలో హస్తం పార్టీ నేతలు చేసిన బుజ్జగింపులు ఫలించాయి.ఈ మేరకు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నిలిచిన పటేల్ రమేశ్ రెడ్డి వెనక్కి తగ్గారని తెలుస్తోంది.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడంతో పటేల్ రమేశ్ రెడ్డి నామినేషన్ ను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు.

ఈ మేరకు ఎంపీ టికెట్ ఇస్తామని కేసీ వేణుగోపాల్ మాట ఇవ్వగా రాతపూర్వక హామీతో పటేల్ రమేశ్ రెడ్డి వెనక్కి తగ్గారు.

అయితే హస్తం పార్టీ నేతలు రమేశ్ రెడ్డి నివాసానికి వచ్చిన సమయంలో ఆయన అనుచరుల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

అయితే పార్టీ ముఖ్యనేతలు రాతపూర్వక హామీ ఇవ్వడంతో పటేల్ రమేశ్ రెడ్డి అనుచరులు కూడా వెనక్కి తగ్గారు.

సొరచేపతో జూనియర్ ఎన్టీఆర్ ఫైట్.. ఆ సినిమాను మించేలా సీన్స్ ఉండనున్నాయా?