ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసు నిందితుల కస్టడీ పిటిషన్ పై ముగిసిన వాదనలు

ఫామ్ హౌజ్ ప్రలోభాల కేసు నిందితుల కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి.

కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురిని ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు ఇరు పక్షాల వాదనలు వినింది.

ఈ క్రమంలో నిందితుల కస్టడీ పిటిషన్ పై రేపు తుది తీర్పు వెలువరించనుంది.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.

రుణమాఫీ, గ్యారెంటీలను అమలు చేస్తే రాజీనామా చేస్తా..: హరీశ్ రావు