పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
TeluguStop.com
నల్లగొండ జిల్లా:పోషణ పక్షంలో భాగంగా శుక్రవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల( Anganwadi Centers )లో ఐసిడిఎస్ సూపర్ వైజర్ విజయలక్ష్మి పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించి, తల్లులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించడం జరిగినది.
మానవ ఆరోగ్య జీవనశైలికి ఎంతగానో తోడ్పడే చిరుధాన్యాలు( Millet ) ఉపయోగపడతాయని,రాగులు,సజ్జలు,జొన్నలు,కొర్రలు, అరికెలు,సామలు వీటిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని,వాటిని ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ కరుణ, ధనమ్మ,గర్భిణీ స్త్రీలు బాలింతలు,మహిళలు, కిషోరబాలికలు,పిల్లలు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’application