మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.ఈ మేరకు ఈసీకి కాంగ్రెస్ నాయకుడు వేణుగోపాల స్వామి కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకోవాల్సిందిగా ప్రజలను మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని వేణు గోపాల స్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏ పార్టీ నుంచి డబ్బు తీసుకున్నా సరే ఓటు మాత్రం బీఆర్ఎస్ కు వేయాలని సూచిస్తున్నారని సీఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ పై తగిన చర్యలు తీసుకోవాలని వేణుగోపాల స్వామి కోరారు.

ఈ క్రమంలోనే మూడు రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన తెలిపారని సమాచారం.

బాలయ్య బాబు కి ఘన సన్మానం..ఆ ఇద్దరికీ అందని ఆహ్వానం…