కత్రినా, విక్కీ పెళ్లిపై వివాదం.. కేసు పెట్టిన స్థానికులు!

ప్రస్తుతం బాలీవుడ్ లో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది కత్రినా కైఫ్ వివాహం అనే చెప్పాలి.

కత్రినా కైఫ్ తన ప్రియుడు విక్కీ కౌశల్ ఎప్పటి నుండో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఇన్ని రోజులకు ఈ బాలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారు.

వీరిద్దరూ డిసెంబర్ లో వివాహం చేసుకుంటున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం అయితే జరుగుతుంది.

ఇక డిసెంబర్ 12న వీరు వివాహం చేసుకుంటున్నట్టు టాక్ బయటకు వచ్చింది.వీరిద్దరిలో ఒక్కరు కూడా వీరి వివాహం పై నోరు మెదపక పోయిన సన్నిహితుల ద్వారా విషయం బయటకు వచ్చింది.

రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ జిల్లా లోని 1వ శతాబ్దపు ప్యాలెస్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా లో ఈ వివాహ వేడుక చేసుకుంటున్నారని సమాచారం.

అతి కొద్ది మంది బంధుమిత్రుల మధ్యనే జరగబోతున్న ఈ పెళ్ళికి బాలీవుడ్ లో కొద్దీ మందికి మాత్రమే ఆహ్వానం అందిస్తున్నట్టు సమాచారం.

ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్న కూడా ఇప్పుడు వీరి పెళ్ళి వేడుకలకు స్థానికులు అడ్డంకిగా మారారు.

వీరికి పెద్ద షాక్ తగిలినట్టు తెలుస్తుంది.కత్రినా, విక్కీ కౌశల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

"""/" / రాజస్థాన్ లోని ప్రఖ్యాత చౌత్ మాత మందిరం ను వీరి పెళ్లి కోసం మూసివేశారంట.

నిత్యం ఎంతో మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించు కుంటారట.అయితే వీరి పెళ్లి చేసే నిర్వాహకులు గత వారం రోజులుగా ఈ మందిరాన్ని మూసి వేసారట.

దీంతో భక్తులకు ఇబ్బంది కారణంగా వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.మందిరానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు వారెవరని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / పెళ్లి కోసం గుడిని మూసివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.వీరిద్దరి వివాహం భద్రతా నియమాల మధ్య జరుగుతుండడంతో మూసి వేయాల్సి వచ్చిందని ఈవెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.

మరి ఈ విషయంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Mahesh Babu , Kasturi : మహేష్ కి జోడి గా చేయాల్సిన వయసు నాది..తల్లిగా ఎలా చేయగలను : కస్తూరి