స్థానిక పోలీసులపై త్వరలోనే ఈసీకి ఫిర్యాదు..: ఎంపీ ఉత్తమ్

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం అవినీతిమయంగా మారిందని ఆరోపించారు.

కోదాడలో దోపిడీ జరుగుతున్న విషయం తెలిసి కూడా బీఆర్ఎస్ బొల్లం మల్లయ్యకు టికెట్ ఇవ్వడం సిగ్గుచేటని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

గంజాయికి కేంద్ర బిందువుగా కోదాడ ఉందన్న ఆయన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు ఎందుకు బందోబస్తు ఇస్తున్నారని ప్రశ్నించారు.

ఈ క్రమంలో పోలీసులు, అధికారులు తమ పరిధి దాటొద్దని సూచించారు.అదేవిధంగా స్థానిక పోలీసులపై త్వరలోనే ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ ఉత్తమ్ తెలిపారు.

అంత అసహనం ఎందుకు ? రేవంత్ కు కేటీఆర్ కౌంటర్