జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనపై కమిటీ భేటీ

దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనపై నిర్వహించిన కమిటీ తొలి సమావేశం ముగిసింది.

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగిందన్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు గులాంనబీ ఆజాద్ హాజరయ్యారు.

ఇందులో భాగంగా జమిలి ఎన్నికలపై వాటాదారులు, రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఏదైనా రాజకీయ పార్టీ కమిటీని కలిసి సూచనలు ఇవ్వొచ్చని సభ్యులు తెలిపారు.

అదేవిధంగా భారత ఎన్నికల సంఘం, న్యాయ కమిషన్ అభిప్రాయాలు సేకరించాలని కమిటీలోని సభ్యులు నిర్ణయించారు.

నేడు ఏపీ ఈ -క్యాబినెట్ సమావేశం.. చర్చించే అంశాలు ఇవే