జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు... టీడీపీ మళ్లీ అదే తప్పు చేస్తోందా..

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బోండా ఉమ మరో సారి కామెంట్లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ ది నందమూరి ఫ్యామిలీ.టీడీపీ పార్టీని స్థాపించింది కూడా నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తే.

అటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టీడీపీకి చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు.దానికి అనేక కారణాలు ఉన్నా.

టీడీపీ నేతలు అనేక సార్లు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

ఇలా జూనియర్ మీద కామెంట్లు చేసిన ప్రతి సారి టీడీపీ పార్టీకి చాలా వరకు లాస్ జరిగిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నా కానీ ఆ పార్టీ నేతలు మాత్రం మారడం లేదు.

సందు దొరికితే చాలు జూనియర్ ఎన్టీఆర్ మీద విమర్శలు చేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు.

టీడీపీ మాజీ మంత్రి బోండా ఉమ మాట్లాడుతూ.జూనియర్ ఎన్టీఆర్ వలన టీడీపీ పార్టీకి ఏం మేలు జరిగిందని ప్రశ్నించారు.

మొన్నటికి మొన్న అసెంబ్లీలో పురంధరేశ్వరిని అంతలా మాటలు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.

2014, 2019 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఏమయ్యాడని ప్రశ్నించారు.బోండా ఉమ ఇలా ఓ చానెల్​ కు ఇచ్చిన ఆన్లైన్ ఇంటర్య్వూలో పై విధంగా వ్యాఖ్యలు చేశారు.

2014 లో టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా చాలా మంది టీడీపీ నేతలు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు కామెంట్లు చేశారని, ఆ కామెంట్లు తర్వాత పార్టీకి చాలా నష్టం తెచ్చిపెట్టాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం కూడా టీడీపీ మరోసారి అదే తప్పును రిపీట్ చేస్తోందని ఇలా చేయడం వలన టీడీపీకి ఒరిగేది ఏమీ ఉండదనేది విశ్లేషకుల మాట.

మరి ఇకనైనా నాయకులు వారి తీరును మార్చుకుంటారో.లేదో.

మూవీ ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోను.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!