బిగ్ బాస్ 7 లో ఆ కొత్త జంట…

తొందర్లోనే బుల్లితెర అభిమానులకి ఒక పెద్ద పండగ రాబోతుందని విషయం అందరికి తెలుస్తుంది.

ఎందుకంటే బుల్లితెర మీద మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ షో సక్సెస్ ఫుల్ గా అరు సీజన్ లు కంప్లీట్ చేసుకుంది.

ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కి( Bigg Boss 7 ) రంగం సిద్ధమైంది.

బిగ్ బాస్ షో యాజమాన్యం చెప్తున్న కథనాల ప్రకారం ఈసారి ఈ షో మరిన్ని సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగ్‌ అంశాలు, భావోద్వేగాలు మిళితమై ఉంటాయని నిర్వాహకులు సోషల్‌ మీడియా ద్వారా ఓ వీడియోని పంచుకున్న సంగతి తెలిసిందే.

ఈ సీజన్ కూడా స్టార్ మరియు డిస్నీ+ హాట్‌ స్టార్‌ ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ కానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే హోస్ట్ ఎవరు అన్నది ఆ టైంలో చెప్పలేదు.చాలా కాలంగా నాగార్జున( Nagarjuna ) ఈ షో నుండీ తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది.

కానీ అందులో నిజం లేదు అని ఈ మధ్యనే ఓ ప్రోమోతో క్లారిటీ ఇచ్చారు.

అందులో నాగార్జున లుక్ కూడా ఆకట్టుకుంది.ఇక కంటెస్టెంట్ల గురించి డిస్కషన్ కూడా మొదలైంది.

క్రికెటర్ వేణుగోపాలరావు కానీ అంబటి రాయుడు( Ambati Rayudu ) కానీ ఇద్దరిలో ఎవరో ఒక్కరూ బిగ్ బాస్ షో లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే స్టార్ కపుల్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ నడుస్తుంది. """/" / వాళ్ళతో పాటు కార్తీక దీపం విలన్ అయిన శోభా శెట్టి( Shoba Shetty ) కూడా ఈ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాలు ఉన్నాయట.

కార్తీక దీపం సీరియల్ తో ఈమె చాలా పాపులర్ అయ్యింది.ఆ సీరియల్ కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది.

అయితే ఆ సీరియల్ తర్వాత ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు.ఓ సినిమాలో నటించింది.

అది రిలీజ్ కాలేదు.సో ఈమె ప్రస్తుతం ఖాళీ.

అందుకే బిగ్ బాస్ లో పాల్గొన బోతున్నట్టు సమాచారం. """/" / ఇక వీళ్లతో పాటు యాదమ్మ రాజు( Yadamma Raju ) అతని భార్య స్టెల్లా( Stella ) ఇద్దరు కూడా ఈ షో లో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

గత కొద్దిరోజులుగా వీళ్ళు విడిపోతున్నారు అనే కామెంట్లు వస్తున్న నేపథ్యంలో వీళ్లిద్దరి ని కలిపి పెళ్లి గొప్పతనం చెప్పడానికి వీళ్లని షో కి రప్పిస్తున్నరు అని తెలుస్తుంది.

ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం : నిరసనల నీడలో డెమొక్రాటిక్ కన్వెన్షన్.. చికాగోలో హై టెన్షన్