కలెక్టరేట్ కే కన్నం

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ లో దొంగల హాలచల్ చేశారు.

గత కొంతకాలంగా కలెక్టరేట్ నిర్మణం కోసం ఉంచిన మెటీరియల్ ను గుర్తు తెలియని దుండగులు గుట్టు చప్పుడు కాకుండా గుటకాయ స్వాహా చేస్తున్నట్లు సమాచారం.

తరచూ మాయమవుతున్న మెటీరియల్ పై అధికారులు నిఘా ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఆదివారం రాత్రి తిరిగి నూతన కలెక్టరేట్ లో టన్నున్నర ఐరన్ మాయమైన విషయం సోమవారం వెలుగుచూసింది.

దీనితో విస్మయానికి గురైన గుత్తేదారులు గాలింపు చేపట్టగా స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్డులోని ఓ టెంట్ హౌస్ లో మాయమైన ఐరన్ మెటీరియల్ ప్రత్యక్షం కావడంతో ఖంగుతిన్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సూర్యాపేట నూతన కలెక్టరేట్ లో ఇప్పటి వరకు సుమారు రూ.

15 లక్షల విలువగల మెటీరియల్ దొంగిలింపబడినట్లు అంచనా వేస్తున్నారు.ఏకంగా కలెక్టరేట్ కే కన్నం వేస్తున్న దొంగలు ఎవరనేది పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రికార్డుల హోరు సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్..