నూతన కలెక్టరేట్ భవనాన్ని విజిట్ చేసిన కలెక్టర్

సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు శనివారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

సూర్యాపేట పట్టణం కుడకుడ పరిధిలో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను అయన పరిశీలించి మాట్లాడుతూ అంతస్తుల వారిగా జరుగుతున్న పనులను వేగవంతం చేయాలన్నారు.

నిర్మితమవుతున్న అన్ని గదులను నిశితంగా పరిశీలించామని,పనులు వేగవంతంగా చేసి,నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను మే చివరి నాటికి పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో రోడ్ల భవనాల శాఖ డీఈ మహిపాల్ రెడ్డి,జేఈ యుగేంధర్,గుత్తేదారు, సైట్ ఇంజనీర్ కిషోర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

కేరళ టూరిజం గురించి లండన్‌లో ప్రచారం.. ఎలాగంటే..