దళిత సమస్యలపై కోటి సంతకాల సేకరణ

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోని దళితులను పాలకులు విస్మరించారని,వారి సమస్యలు భారత రాష్ట్రపతికి తెలిపేందుకు ప్రజా సంఘాల అధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రారంభించినట్లు వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు అన్నారు.

గురువారం మునగాల మండల కేంద్రంలో రాష్ట్రపతికి దళితుల సమస్యలపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బికేఎంయు జిల్లా అధ్యక్షులు రెమిడీల రాజు, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు,సోమపంగు జానయ్య,ఆరే రామకృష్ణారెడ్డి,సిఐటియు మండల కన్వీనర్ బచ్చలకూర స్వరాజ్యం,కిన్నెర వెంకన్న,గడ్డం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

శివ సినిమా వచ్చి అప్పుడే 35 సంవత్సరాల అవుతుందా..?