కర్రలతో దాండియా ఆడుతూ ఒక్కసారి కుప్పకూలాడు.. వీడియో వైరల్..

భగవంతుడు ఎవరి చావు రేఖను ఎప్పుడూ రాశాడో ఎవరికీ తెలియదు.ఎవరి చావు ఎప్పుడు వస్తుందో ముందే తెలిసిపోతే ఆ నరకం మాటల్లో వివరించలేనిది.

ఇప్పుడు మనిషి చావు ఎలా అయిపోయింది అంటే ఒక చీమ కుట్టినప్పుడు మనం దాన్ని ఎలా నలిపేస్తామో అల క్షణాల్లోనే మనిషి చావు వచ్చేసింది అనడానికి ఇలాంటి సంఘటనలు రుజువు.

పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో ఆ వ్యక్తి ప్రాణం పోతుందని అక్కడ ఉన్న వారు ఎవ్వరు ఇచ్చి ఉండరు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోకి సంబంధించిన దాని ప్రకారం గుజరాత్ లోని దహోద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

అయితే, పండుగ సందర్భంగా ఇంట్లోని సభ్యులందరూ ఎంతో ఆనందంగా దాండియా ఆడుతూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పండగ వాతావరణాన్ని ఆనందిస్తున్నారు.

పెద్దలు కేకలు వేస్తూ, చిన్నారులు ఈలలు వేస్తూ, కర్రలతో దాండియా ఆడుతున్నప్పుడు అందులోని ఓ వ్యక్తి దాండియా ఆడుతూ ఒక్కసారిగా కొన్ని క్షణాల్లో కింద పడి కుప్పకూలిపోయాడు.

అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడి వద్దకు పరిగెత్తుకుంటూ రావడం ఆ వీడియోలో చూడొచ్చు.

"""/"/ కుటుంబ సభ్యులు అందరూ కలిసి అతన్ని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా అతని పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతను మృతి చెందినట్లు స్పష్టం చేశారు.

ఈ వార్త విన్న కుటుంబ సభ్యులందరూ, అప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్న వారు ఒక్కసారిగా ఎంతో బాధపడి తల్లడిల్లిపోయారు.

ఆ ఇంట్లో ఒక్కసారిగి విషాదఛాయలు అములుకున్నాయి.కాగా, దాండియా ఆడుతూ అతను గుండెపోటు కారణంగా చనిపోయాడని వైద్యులు వెల్లడించారు.

ఇక, ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆవేదనతో కామెంట్స్‌ చేశారు.

వాళ్లు ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా.. బ్రహ్మాజీ కామెంట్స్ వైరల్!