మహేష్ త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్.. అభిమానుల్లో టెన్షన్.. ఏం జరిగిందంటే?

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు.

కరోనా కారణం వల్ల ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం ప్రతిసారి వాయిదా పడుతూ విడుదల ఆలస్యం అవుతుంది.

ఈ క్రమంలోనే మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసుకుని అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పాల్గొంటారు.

ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో సుమారు పదకొండు సంవత్సరాల క్రితం అతడు ఖలేజా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

పదకొండు సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలు ఎక్కుతుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానులు ఒక విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.

"""/"/ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా పై భారీ అంచనాలు పెరగడంతో స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీ టాక్.

ఈ క్రమంలోనే అభిమానులు ఈ విషయం పై తీవ్ర ఆందోళన చెందుతున్నారు.మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.

ఇకపోతే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా సంయుక్త మీనన్ మహేష్ బాబు మరదలు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా..!!