భూపాలపల్లి జిల్లాలో బొగ్గు లారీ దగ్ధం
TeluguStop.com
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ బొగ్గు లారీ మంటల్లో కాలిబూడిదైంది.కాటారం, మహదేవపూర్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.