రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీకి బయలుదేరనున్నారు.కేంద్ర హోంమంత్రి మంత్రి అధ్యక్షతన.

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమావేశం లో సీఎం జగన్ పాల్గొననున్నారు.25 వ తారీఖున గన్నవరం నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు.

ఎల్లుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరగబోయే సమావేశంలో జగన్ కూడా పాల్గొననున్నారు.

ఈ సమావేశాలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు చతిస్ ఘడ్, ఒడిస్సా, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రుకి కూడా ఆహ్వానం అందింది.

మావోయిస్టు ప్రాంతాలలో శాంతి భద్రతలు అదే రీతిలో అభివృద్ధి గురించి ఈ సమావేశంలో సీఎంలతో.

అమిత్ షా చర్చించనున్నట్లు సమాచారం.ఈ సమావేశం అనంతరం ప్రత్యేకంగా అమిత్ షా తో జగన్ భేటీ కానున్నారట.

అనంతరం 27వ తారీకు అమరావతికి చేరుకోనున్నారు. మరోపక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సమావేశం కోసం ఈరోజే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రత్యేక విమానం.

లో ఢిల్లీ బయలుదేరడానికి రెడీ అయ్యారు.ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ కేంద్ర జల శక్తి మంత్రి తో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం.

బాలయ్య తో కామెడీ సినిమా చేయాలనుకున్న స్టార్ డైరెక్టర్.. అది ఎలా మిస్ అయిందంటే..?