సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి
TeluguStop.com
నల్లగొండ జిల్లా: పెద్దవూర మరియు తిరుమలగిరి(సాగర్) మండలాలకు చెందిన 200 మందికి నాగార్జున సాగర్ ఎమ్మేల్యే కుందూరు జయవీర్ రెడ్డి గురువారం తననివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,అనుమల మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, నాగార్జునసాగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు,తిరుమలగిరి(సాగర్)మండల అధ్యక్షుడు క్రిష్ణ నాయక్,పెద్దవూర మండల అధ్యక్షుడు పబ్బు గిరి తదితరులు పాల్గొన్నారు.