రేపు మంత్రులు, జిల్లా అధ్యక్షులతో సీఎం కేసీఆర్ భేటీ
TeluguStop.com
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు మంత్రులు, జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నారు.అనంతరం వారితో కలిసి లంచ్ చేయనున్నారని తెలుస్తోంది.
జాతీయ పార్టీ ఏర్పాటు పరిణామాలు, పార్టీ ప్రకటన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
అయితే, ఇప్పటికే జాతీయ పార్టీకి సర్వం సిద్ధం అయినట్లు సమాచారం.దసరా పండుగ రోజే పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు.
మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టీ పేరు ప్రకటించనున్నారు.
పార్టీ పేరుగా భారత రాష్ట్ర సమితి వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
అదే రోజు ఢిల్లీలో తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు.
ఏంది భయ్యా.. ఈ మొసలి అలా అటాక్ చేస్తోంది.. వీడియో వైరల్..