ఢిల్లీకి పయనమవుతున్న సీఎం కేసీఆర్..!!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో డీ అంటే డీ అన్న విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

బిజెపి ని ఢీ కొట్టడానికి.బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలను ఏకం చేస్తూ వారితో కలుస్తూ ఇటీవల వ్యవహరిస్తున్నారు.

దీనిలో భాగంగా గత ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ని ముంబై లో కలవడం తెలిసిందే.

ఆతర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వంటి నాయకులను కూడా కలిశారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కి మాజీ ప్రధాని దేవెగౌడ.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి నాయకులు మద్దతు తెలిపారు.ఇదిలా ఉంటే ఈ రోజు ఢిల్లీకి వెళ్లాలని కెసిఆర్ రెడీ అవగా ఈ టూర్ రేపటికి వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలియజేస్తున్నాయి.

రేపు సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్.

పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి పోతున్నారట.ఈ క్రమంలో రేపు ఢిల్లీలో కెసిఆర్ ఎవరి తో భేటీ అవుతారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది.

బరువు తగ్గడం కోసం నిత్యం నిమ్మకాయలు తీసుకోవడం మంచిదేనా..?