రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం జగన్..!!

కొత్త సంవత్సర వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.కరోనా భయం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రజలు 2023కి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ క్రమంలో చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటిలో ఆనందం నింపాలని.మంచి ఆరోగ్యం అందించాలని ఆకాంక్షించరు.

ప్రజలకు మెరుగైన ఉజ్వల భవిష్యత్తు కోసం.సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా తన ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే జనవరి మూడవ తారీకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో రాజమహేంద్రవరం మున్సిపల్ స్టేడియంలో హెలిపాడ్ కి చేరుకోనున్నారు.

ఆరోజు 13 రకాల పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులను.ఉద్దేశించి భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.

హిందూ ధర్మం నుంచి ప్రేరణ పొందుతాను : యూకే ప్రధాని రిషి సునాక్