ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తి ప‌ర్య‌ట‌న‌కు సీఎం జ‌గ‌న్

ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తిలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు.దీనిలో భాగంగా తాడేప‌ల్లి నివాసం నుంచి ఆయ‌న బ‌య‌లుదేరారు.

చీమ‌కుర్తి మెయిన్ రోడ్డులోని బూచేప‌ల్లి సుబ్బారెడ్డి క‌ల్యాణ మంట‌పం వద్ద దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్ర‌హాల‌ను ఆయ‌న ఆవిష్క‌రించ‌నున్నారు.

అనంతరం బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ వ‌ద్ద బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌వుతారు.మ‌రోవైపు, సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జిల్లాలో పోలీసులు భారీ భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు.

ఈ క్ర‌మంలో ఎక్క‌డిక‌క్క‌డ బ్యారికేడ్ల‌ను ఏర్పాటు చేసి, ప‌రిస్థితుల‌ను స‌మీక్షిస్తున్నారు.

జగన్ కు ఇదే అతిపెద్ద సవాల్ ! మారుతారో మార్చుతారో ?