క్యాంపు కార్యాలయం నుండి రెండు కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి.చిత్తూరు జిల్లా పుంగనూరు బస్ డిపో ప్రారంభించడం జరిగింది.

అదేవిధంగా కడప బస్ స్టేషన్ పేరును వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరుగా మార్చడం మాత్రమే కాక కడపలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏరియా ఆస్పత్రిని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ సమావేశం ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ చిత్తూరులో బస్సు డిపో ప్రారంభించటం అదేవిధంగా కడపలో హాస్పిటల్ ప్రారంభించటంఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

కరోనా లాంటి కష్టకాలంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ తోపాటు ఆర్టీసీ కూడా వైద్య సేవలు అందించడం అభినందించదగ్గ విషయమని వైయస్సార్ హాస్పిటల్ ద్వారా ఆర్టీసీ సంస్థ ఉద్యోగస్తులకు వైద్యం అందుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈ రెండు హామీలు ఇవ్వడంతో తాజాగా సీఎం జగన్ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాడిని నెరవేరడంతో చిత్తూరు జిల్లా వాసులు అదేవిధంగా కడప ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  .

కెనడా : రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయులు వీరే , ఇండియన్ కాన్సులేట్ సంతాపం