సీఎం జగన్ ఒడిశా- శ్రీకాకుళం పర్యటన షెడ్యూల్..!!

సీఎం జగన్ రేపు శ్రీకాకుళం.ఒడిశా ప్రాంతాలలో పర్యటించనున్నారు.

ఉదయం 11 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాలకు పాతపట్నం చేరుకొని.

అక్కడ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించ నున్నారు.

అనంతరం శ్రీకాకుళం పర్యటన ముగిసిన తర్వాత విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి బయలుదేరి మధ్యాహ్నం మూడున్నర గంటలకి భువనేశ్వర్ చేరుకున్నారు.

అనంతరం సాయంత్రం 5 గంటలకు.భువనేశ్వర్ లో.

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు అనంతరం ఉభయ రాష్ట్రాలకు చెందిన పలు అంశాలపై చర్చించనున్నారు.

ముఖ్యంగా ఈ భేటీలో మూడు ప్రధాన అంశాలపై.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

విషయంలోకి వెళితే వంశధార నదిపై నేరడి వద్ద ఆనకట్ట నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, సరిహద్దులోని కొఠియా గ్రామాల అంశాలను ప్రధానంగా చర్చించనునట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది.

వేసవిలో ఆరోగ్యానికి అండగా నిలిచే సత్తు పానీయం.. రోజు తీసుకుంటే అదిరిపోయే లాభాలు మీ సొంతం!