ఏపీలో పెట్టుబడుల కోసం రంగంలోకి సీఎం జగన్..!

ఏపీలో పెట్టుబడుల కోసం డైరెక్ట్ గా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు.ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహాక సదస్సులో పాల్గొననున్నారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వివిధ దేశాల దౌత్యవేత్తలు, సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ కానున్నారు.

సుమారు 44 దేశాలకు చెందిన దౌత్యవేత్తలతో సమావేశాలు ఉండనున్నాయి.ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల అంబాసిడర్లతో జగన్ ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు.

మార్చి 3, 4వ తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ జరగనుంది.

సందీప్ రెడ్డి వంగా మాకు కావాలంటున్న బాలీవుడ్ స్టార్ హీరోలు…ఎవరంటే..?