కాశ్మీర్ లో ఏపీకి చెందిన జవాన్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం..!!

ఇటీవల కాశ్మీర్ లోయలో బస్సు ప్రమాద ఘటనలో ఏడుగురు జవాన్ లు మరణించడం తెలిసిందే.

అయితే వీరిలో అన్నమయ్య జిల్లా సాంబేపల్లి మండలం దేవపట్లకు చెందిన జవాన్ దేవరింటి రాజశేఖర్ కూడా మృతిచెందినట్లు బంధువులకు సమాచారం అందింది.

బద్రీనాథ్ బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తున్న పయనంలో ఇండో టిబిటిన్ బోర్డర్ పోలీస్ (ఐటీబిపి) బస్సు మంగళవారం ప్రమాదానికి గురైంది.

ఈ ఘటనలో ఏపీకి చెందిన జవాన్ రాజశేఖర్ మృతి చెందినట్లు ఉన్నతాధికారులు సమాచారం అందించారు.

రాజశేఖర్ గత 12 సంవత్సరాలు నుండి ఐటీబిపిలో విధులు నిర్వహిస్తున్నారు.ఇటీవల రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్ళటం జరిగింది.

ఇంతలోనే రాజశేఖర్ మృతి చెందినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు అవుతున్నారు.

రాజశేఖర్ భార్య ప్రమీల, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఈ క్రమంలో జవాన్ రాజశేఖర్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. కస్టడీకి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు..!