మద్యం మత్తులో కొట్టుకున్న వైసీపీ, టీడీపీ వర్గీయులు.. ఘర్షణకు కారణం ఇదేనటా.. ?

మనిషి చనిపోతే ఆ బాధలో ఉంటారు అక్కడ వున్న వారు.ఇలా ఉన్న పరిస్దితుల్లో ఎవరు కూడా గొడవలు చేయడానికి సాహసించరు.

కానీ ఓ రెండు పార్టీల వర్గాల వారు మాత్రం ఇవేమి ఆలోచించకుండా గొడవకు దిగారట.

శ్రీకాకుళం జిల్లా కంచిలి (మం) అర్జునాపురంలో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుంటే.

గతరాత్రి అర్జునాపురం గ్రామంలో మరణించిన ఒక వ్యక్తి దహన సంస్కారాల్లో పాల్గొన్న వైసీపీ, టీడీపీ వర్గీయులు పీకలదాకా మద్యం తాగారట.

ఆ తర్వాత కల్లుతాగిన కోతి చిందులేసినట్లు ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో అదికాస్త ఘర్షణకు దారితీసిందట.

దీంతో ఒకరి పై ఒకరు కర్రలు, కత్తులతో దాడి చేసుకోగా, ఈ దాడిలోh3 Class=subheader-style టీడీపీ/h3pకి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారట.

ఇలా గాయపడిన వారిని సోంపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారట.ఇకపోతే దహనసంస్కారాల్లో తలెత్తిన వివాదం వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసిందనే విషయం తెలిసిన వారు ఈ ఘటనకు బాధ్యులైన వారికి బుద్ధి,జ్ఞానం లేదని దుమ్మెత్తిపోస్తున్నారట.

కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ ఫైర్