తిరుపతి జిల్లాలో భూవివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో ఉద్రిక్తత నెలకొంది.బీరకుప్పం పంచాయతీలో భూ వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన విజయన్, రవీంద్రన్ అనే వ్యక్తుల మధ్య గత మూడు నెలలుగా ఇంటి స్థలం కోసం వివాదం నడుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా సమస్య తారాస్థాయికి చేరడంతో ఇరు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.

ఈ గొడవలో తీవ్రగాయాలపాలై ఒకరు మృతిచెందగా.ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు.

అనంతరం బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వనపర్తి కాంగ్రెస్ లో చేరికల లొల్లి.. ఎమ్మెల్యే మేఘారెడ్డి నివాసం వద్ద నిరసన.!