ఫ్లైట్‎లో సీటు కోసం ప్రయాణికుల మధ్య ఘర్షణ..?

ఫ్లైట్ లో సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఈ సంఘటన థాయ్ స్మైల్ ఎయిర్‎వేస్ విమానంలో చోటు చేసుకుంది.సీటు కోసం ఓ ప్రయాణికుడి చెంపలు వాయించాడు మరో వ్యక్తి.

బ్యాంకాక్ నుంచి కోల్ కతా వస్తున్న విమానంలో ఈ ఘర్షణ చెలరేగింది.ఫ్లైట్ సిబ్బంది వారించినా ప్రయాణికులు వెనక్కి తగ్గలేదు.

దీంతో ఫ్లైట్ లో కాసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది.