సీఐ ఆధ్వర్యంలో పోలీసుల వాహనాల తనిఖీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.

వాహనాలు నడిపే వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వాహనాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ తమ వాహనాల వెంబడి సరైన ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలని, ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు.

రోడ్డు నియమ నిబంధనలు పాటించకుండా వాహనదారులు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సీఐ వెంట ఎల్లారెడ్డి పేట ఎస్.ఐ రమాకాంత్ పోలీసులు ఉన్నారు.

వారానికి ఒక్కసారైనా సొరకాయ తింటున్నారా.. లేకుంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!