స్టేజిపైనే ముద్దులు.. అప్పుడు కాజల్.. ఇప్పుడు ఎన్టీఆర్.. చోటా కె నాయుడుపై ట్రోల్స్?

కొన్ని కొన్ని సార్లు కొందరు ఏదైనా అభినందనలు తెలిపేటప్పుడు వారికి కొన్ని అలవాట్లు ఉంటాయి.

కొందరు హగ్ చేసుకుంటే మరికొందరు షేక్ హ్యాండ్ ఇస్తుంటారు.ఇక కొందరు మాత్రం ఏకంగా ముద్దులే పెట్టేస్తారు.

నిజానికి అది అడ్వాంటేజ్ అనుకోవద్దు.అది వారికొక అలవాటు.

అభినందలు తెలిపే సమయంలో వారికి వచ్చే అలవాటు అది.కానీ దీన్ని చూసే వాళ్లు మరోలా అర్థం చేసుకుంటారు.

అలా ఇప్పుడు చోటా కే నాయుడు పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ.ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా పనిచేశాడు చోటా కె నాయుడు.

ఈయన 1992 నుండి సినిమాటోగ్రఫీ గా పని చేస్తున్నాడు.ఇక 2016లో కృష్ణాష్టమి సినిమాకు చేయగా.

అప్పుడు బ్రేక్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ తో బింబిసార సినిమాతో ముందుకు వచ్చాడు.

ఇక ఇదంతా పక్కన పెడితే ఈయనకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపే సమయంలో ఒక అలవాటు ఉంది.

అదేంటంటే ఎవరినైనా ముద్దు పెట్టడం.అయితే గతంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన కవచం సినిమాకు చోటే కె నాయుడు సినిమాటోగ్రఫర్ గా పని చేశాడు.

అయితే ఆ సినిమా టీజర్ సమయంలో కాజల్ వేదికపై మాట్లాడుతూ ఉంది.దీంతో ఆ సమయంలో చోటా కె నాయుడు ఆమె దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపి చెంపపై ముద్దు పెట్టుకున్నాడు.

దీంతో అప్పట్లో ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.ఆయన అలా ముద్దు పెట్టుకోవడం ఏంటి అంటూ దారుణంగా ట్రోల్స్ కూడా చేశారు.

కానీ ఈ విషయం గురించి చోటా కె నాయుడు అప్పుడే స్పందించాడు.తనకు దివంగత నటి సౌందర్య తర్వాత ఇప్పుడున్న హీరోయిన్లలో కాజల్ అంటే ఇష్టమని.

ఆమెతో పని చేయటం చాలా అదృష్టమని.పైగా ఆమె తనకు మంచి స్నేహితురాలు అని అన్నాడు.

అంతేకాకుండా కాజల్ కూడా తనను కుటుంబ సభ్యుడిగా భావిస్తుంది అని.అలా తను ఒక సినిమాలో అవకాశం వచ్చింది అని ప్రకటించడంతో సంతోషంలో ముద్దు పెట్టుకున్నాను అని.

అంతేకానీ అందులో తాను తప్పుగా ప్రవర్తించలేదు అని అన్నాడు. """/" / ఇక మరోసారి తాజాగా ఆయన సినిమాటోగ్రఫీ అందించిన బింబిసారా సినిమా ఈవెంట్ లో కూడా పాల్గొని అందులో ఎన్టీఆర్ మాట్లాడుతుండగా ఆయన దగ్గరికి వెళ్లి ఆయనను కూడా ముద్దు పెట్టుకున్నాడు.

దీంతో ఈ విషయం మరోసారి నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది.అప్పుడేమో కాజల్.

ఇప్పుడేమో ఎన్టీఆర్.తర్వాత ఎవరు అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక మరికొందరు నిజానికి ఆయన ఒక అభినందలుగా మాత్రమే అలా చేస్తాడని గతంలో తెలిపాడు.

ఒకప్పుడు కాజల్ కి అడ్వాంటేజ్ గా ఇచ్చాడు అనుకుంటే మరి ఎన్టీఆర్ కు ఎందుకు ఇచ్చాడో చెప్పండి అంటూ ప్రశ్నిస్తున్నారు.

నా మాతృభూమి నాకు ముఖ్యమంటూ రూ.కోట్లు వదులుకున్న సుదీప్.. ఏం జరిగిందంటే?