ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు రావట్లేదు.. చైతన్య తల్లి షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన చైతన్య( Choreographer Chaitanya ) మృతి చెందడం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.

అప్పుల బాధలు తట్టుకోలేక చనిపోతున్నానని చైతన్య సెల్ఫీ వీడియోలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

అయితే భారీ ఆస్తులు ఉన్న చైతన్య అప్పుల వల్ల మరణించాడని అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులు నమ్మడం లేదు.

చైతన్య తల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ కావడం గమనార్హం.చైతన్య తల్లి లక్ష్మీరాజ్యం ( Lakshmi Rajyam ) మాట్లాడుతూ చనిపోవడానికి పావుగంట ముందు తన కొడుకు నాతో మాట్లాడాడని ఆమె అన్నారు.

సన్మాన కార్యక్రమంలో డల్ గా ఉన్నావని నవ్వుతూ ఉండాలని నేను చెప్పానని లక్ష్మీరాజ్యం కామెంట్లు చేశారు.

పెద్దపెద్ద వాళ్లు నీకు సన్మానాలు చేస్తున్నారని అందరితో పరిచయాలు పెంచుకోవాలని నేను చెప్పానని లక్ష్మీరాజ్యం అన్నారు.

అలా చెప్పిన పావుగంటకే సూసైడ్ చేసుకున్నాడని ఆమె చెప్పుకొచ్చారు. """/" / చైతన్యతో గుడికి వెళ్లాలని చెప్పగా నాకు కూడా చిరాకుగా ఉందమ్మా గుడికి వెళ్దాం అని చైతన్య చెప్పాడని ఆమె కామెంట్లు చేశారు.

గుడికి ప్లాన్ చేయాలని తన కొడుకు సూచనలు చేశాడని లక్ష్మీరాజ్యం పేర్కొన్నారు.గతంలో ఒకసారి చైతన్య ఫోన్ చేసి నువ్వు ఇంటికి రాకపోతే చచ్చిపోతా అని నాతో అన్నాడని ఆమె తెలిపారు.

హెల్త్ కాపాడుకోవాలని నా కొడుకు చెప్పేవాడని చైతన్య తల్లి పేర్కొన్నారు. """/" / పిల్లలకు మంచి ఆహారం పెడితే మనల్ని గౌరవిస్తారని తన కొడుకు చెప్పాడని చైతన్య తల్లి చెప్పుకొచ్చారు.

డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చని తన కొడుకు అనేవాడని చైతన్య తల్లి చెప్పుకొచ్చారు.నా కొడుకు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదని నాకు ఏడుపు కూడా రావడం లేదని చైతన్య తల్లి కామెంట్లు చేశారు.

చైతన్య తల్లి ఆవేదనను చూసి నెటిజన్లు సైతం కంటతడి పెట్టుకున్నారు.నా కొడుకు చనిపోయి నాకు ద్రోహం చేశాడనే బాధ ఎక్కువగా ఉందని ఆమె తెలిపారు.

దేవర బెనిఫిట్ షో టికెట్ ధర తెలిస్తే  గుండె ఆగిపోవాల్సిందే.. ధర ఎంతంటే?