ట్విట్టర్లో పోస్ట్ చూసి చలించి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే సుంకే రవి శంకర్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన కళ్యాణం వేణు, సాగరిక అన్నా చెల్లెళ్ళు పుట్టుకతో వికలాంగులు.

కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కి ట్విట్టర్ పోస్టు ద్వారా తెలిపారు.

ఆ పోస్ట్ కు స్పందించి, గురువారం రోజున ఎమ్మెల్యే బాదిత కుటుంబానికి తక్షణ సహాయం కింద 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.

బీసీ బందు ద్వారా అతనికి, అతని సోదరునికి రెండు యూనిట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రవి శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే వెంట సర్పంచ్ ఒంటెల గోపాల్ రెడ్డి, కొంకటి మధు తదితరులు ఉన్నారు.

రోజు బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని తీసుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా నాజూగ్గా మారతారు!