చిరు, కొరటాల మూవీ ఆ ఒక్క విషయం తప్ప ఏ ఒక్క విషయాన్ని నమ్మకండి

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' భారీ ఎత్తున తెరకెక్కుతుంది.దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

రికార్డు స్థాయి బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అంచనాలను అందుకునేలా సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు.

చిరంజీవి 152వ చిత్రంకు ఇప్పటికే దర్శకుడు ఫిక్స్‌ అయ్యాడు.కొరటాల శివను భారీ ఆఫర్‌ ఇచ్చి మరీ రామ్‌ చరణ్‌ బుక్‌ చేశాడు.

భరత్‌ అనే నేను చిత్రం వచ్చి చాలా నెలుల అవుతున్నా కూడా చిరంజీవితో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో కొరటాల వెయిట్‌ చేస్తున్నాడు.

ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ మామూలుగా అయితే కొరటాల శివ ఇంత ఆలస్యం అయితే మరో ప్రాజెక్ట్‌కు కమిట్‌ అవుతాడు.

అందుకే ఆమద్య సైరా ఆలస్యం అవుతున్న కారణంగా కొరటాల ఒక యువ హీరోతో సినిమాకు కమిట్‌ అయ్యాడని, త్వరలోనే ఆ సినిమాను మొదలు పెడతాడని, ఆ తర్వాత చిరంజీవి సినిమాను చేస్తాడంటూ వార్తలు వచ్చాయి.

ఆ వార్తలపై తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.అతి త్వరలోనే చిరంజీవి, కొరటాల మూవీ కాంబో పట్టాలెక్కబోతుందని అధికారికంగా ప్రకటన వచ్చింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇక చిత్రంలో హీరోయిన్స్‌ విషయంలో పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కథ విషయంలో కూడా మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా రాసేస్తున్నారు.ఇలా మీడియాలో వస్తున్న వార్తలన్నింటికి కూడా నిర్మాణ సంస్థ నుండి అధికారికంగా ఒక ప్రకటన వచ్చింది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది.ఈ ఒక్క వార్త తప్ప మిగిలిన అన్ని వార్తలు కూడా పుకార్లే అంటూ తేల్చి చెప్పారు.

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు