వాళ్లను మాత్రమే నేను మోసం చేశా.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు వైరల్!

తన నేచర్ ద్వారా, సినిమాల ద్వారా కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న హీరోలలో చిరంజీవి ఒకరు.

ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడం పూర్వజన్మ సుకృతం అనిపిస్తుందని తెలిపారు.

కుటుంబంలో ఉన్న హీరోలు ఇమేజ్ నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నం సంతోషాన్ని కలిగిస్తోందని చిరంజీవి కామెంట్లు చేశారు.

ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేక నా స్పీచ్ త్వరగా ముగించాలని పోలీసులు రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయని చిరంజీవి చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమైన సమయంలో నాకు అండగా నిలిచిన అభిమానులను చూసి వీళ్లను నేను మోసం చేశానని నాకు అనిపించిందని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇకపై ఫ్యాన్స్ కోసం వరుసగా సినిమాలు చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. """/"/ పాత సినిమాలలో బాగా నచ్చిన మూవీ శంకరా భరణం అని ఆయన తెలిపారు.

డైరెక్షన్ అనేది అదనపు ఒత్తిడి అని చిరంజీవి పేర్కొన్నారు.నేను రాజకీయాల్లోకి వెళ్లిన సమయంలో చరణ్ చాలా బాధ పడ్డాడని చిరంజీవి వెల్లడించారు.

ముఠామేస్త్రి తరహా గెటప్ లో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో కనిపించనున్నారు.రవితేజ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు.

"""/"/ ఈ సినిమాలో రవితేజ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది.

ఇద్దరు హీరోల అభిమానులను మెప్పించేలా ఈ సినిమా ఉండనుందని సమాచారం.చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు సంక్రాంతికి విడుదలై సక్సెస్ సాధించాయి.

వాల్తేరు వీరయ్య విషయంలో కూడా ఇదే ఫలితం రిపీట్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవికి ఈ మధ్య కాలంలో వరుస షాకులు తగులుతున్నాయి.అయితే వాల్తేరు వీరయ్య సినిమా ఈ ఫ్లాప్స్ ను బ్రేక్ చేసి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

చిరంజీవి త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.

CM Relief Fund Cheque Fraud : సీఎంఆర్ఎఫ్ చెక్కుల వ్యవహారంలో నిందితుల రిమాండ్..!!