మెగా అభిమానులకు శుభవార్త!

మెగా ఫ్యామిలీకి అభిమానులు ఎంతమంది ఉన్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మెగాస్టార్ సినిమా అన్న.

వారి సినిమా గురించి న్యూస్ అన్న నెట్టింట్లో క్షణాల్లో వైరల్ అయిపోతుంది.ఇక అలానే మెగా అభిమానులకు ఒక అద్భుతమైన శుభవార్త అందింది.

అది ఏంటి అంటే? ఇన్నాళ్లు గుస గుసలులా వినిపించే వార్త ఇప్పుడు నిజం అయ్యింది.

అది ఏంటంటే.మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో కనిపించనున్నారు.

అదేనండి.మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఆచార్యలో రామ్ చరణ్ నటించనున్నాడని వార్తలు వచ్చాయ్ కదా! ఇక ఈ విషయన్నీ ప్రముఖ ఆంగ్ల పత్రికతో రామ్ చరణ్ చెప్పేశారు.

రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కలిసి ఆచార్య సినిమాలో నటించనున్నట్టు చరణ్ అధికారకంగా ప్రకటన చేశారు.

రామ్ చరణ్, మెగాస్టార్ కలిసి ఇప్పటి వరకు ఒక సినిమాలో కూడా నటించలేదు.

కేవలం అయన సినిమాల్లో ఈయన.ఈయన సినిమాల్లో అయన గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపించారు.

మగధీర సినిమాలో ఒక పాటలో, బ్రూస్‌లీ సినిమాలో క్లైమాక్స్ లో, ఖైదీ నెంబర్‌ 150లో ఒక పాటలో చరణ్ కనిపించాడు.

ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించనున్నారు.ఈ విషయంపై రామ్ చరణ్ మాట్లాడుతూ.

''స్టార్‌డమ్‌, ప్రేక్షకుల అభిమానం అన్ని మా నాన్న వల్ల నాకు వచ్చినవే.అలాంటి ఆయనతో కలిసి వెండితెరను పంచుకోవడం నా అదృష్టం.

2015లో నేను నటించిన ''బ్రూస్‌లీ'' చిత్రంలో నాన్న ప్రత్యేక పాత్రలో నటించారు.అదేవిధంగా ''ఖైదీ నెంబర్‌ 150''లోని పాటలో నేను నాన్నతో కలిసి స్టెప్పులేశా.

ఇప్పుడు ''ఆచార్య''లో మళ్లీ కలిసి తెరపై కనిపిస్తాం'' అంతేకాదు ''నేను నాన్న కలిసి ఓకే సినిమాలో నటించడం మా అమ్మ కల'' అంటూ అయన చెప్పారు.

దీంతో మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్