ఎమోషనల్ పోస్ట్ పెట్టిన చిరంజీవి…

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కుటుంబంలో మరో తరంవారసురాలు జన్మించింది.

రామ్ చరణ్, ఉపాసన( Ram Charan, Upasana ) తల్లిదండ్రులు అయ్యారు.వీరికి పండంటి పాపాయి పుట్టింది.

మంగళవారం తెల్లవారుజామున ఉపాసనకు పాపాయి పుట్టినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.దీంతో మెగా ఫ్యామిలీతోపాటు అభిమానుల్లో సంబరాలు మిన్నంటాయి.

తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేశారు .

మెగా వారసురాలు వచ్చిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఉపాసన పండంటి పాపాయికి జన్మనివ్వడంతో ఇటు మెగా కుటుంబంలో.

అటు కామినేని కుటుంబంలో సంతోషం వ్యక్తం అవుతోంది.ఉపాసనతోపాటు రామ్ చరణ్‌ కూడా సోమవారమే ఆసుపత్రికి వచ్చాడు.

తన కూతురిని చూసి మెగా పవర్ స్టార్ మురిపిపోయాడని సన్నిహితులు చెబుతున్నారు. """/" / మంగళవారం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చి రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అభినందనలు తెలిపారు .

తాజాగా, మెగాస్టార్ చిరంజీవి మనవరాలి రాకపై పై ఓ ట్వీట్ చేశారు.‘నీ రాకతో మెగా ఫ్యామిలీకి ఉత్సాహం తీసుకొచ్చావు.

నీ రాకతో కోట్లాది మంది మెగా ఫ్యామిలీ( Mega Family ) మీ తల్లిదండ్రులను ఆశీర్వదించినట్లు అనిపిస్తుంది.

తల్లిదండ్రులుగా రామ్ చరణ్, ఉపాసన, తాతగా నాకు సంతోషంగా గర్వంగానూ ఉంది’ అంటూ చిరు రాసుకొచ్చారు.

ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ చిరు తాతయ్య అయ్యారని ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు.

ఇక గత కొద్దిరోజులుగా రామ్ చరణ్-ఉపాసన జంట ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

మెగా ప్రిన్స్ వస్తాడా.మెగా ప్రిన్సెస్ వస్తుందా.

అని గతకొద్ది రోజులుగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.ముందుగా జూలైలో ఉపాసన డెలివరీ తేదీ ఉంటుందని అనుకోగా.

కానీ తరువాత జూన్ 20వ తేదీకి కన్ఫర్మ్ అయింది.ఉపాసన ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మెగా అభిమానులు సంబరాలు, ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేసుకున్నారు.

పండంటి పాపాయికి జన్మనిచ్చిన విషయం తెలియగానే వారంతా సంబురాలు చేసుకుంటూ చెర్రీ -ఉపాసన దంపతులకి శుభాకాంక్షలు చెబుతున్నారు.

పవన్ రాజకీయాలలో ఒక ఫుట్ బాల్..ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్!