లవ్ స్టోరీకి ఇద్దరు చీఫ్ గెస్ట్స్... ఎవరొస్తున్నారంటే?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య -సాయి పల్లవి జంటగా తెరకెక్కినటువంటి చిత్రం "లవ్ స్టోరీ".

ఈ సినిమా కరోనా రెండవదశ రాకముందే విడుదల కావాల్సి ఉండగా అప్పటికే థియేటర్లు మూత పడటంతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేక పోయింది.

ఈ క్రమంలోనే అన్ని అడ్డంకులు తొలగించుకుంటూ ఈ నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.

ఇప్పటికే ఈ సినిమాలో నుంచి విడుదలైనటువంటి పాటలు, టీజర్, ప్రేక్షకులకు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఇక ఈ సినిమాలో విడుదలైనటువంటి సారంగదరియా పాట ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీలో సాయి పల్లవి తన అద్భుతమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలుస్తోంది.

ఇకపోతే ఈ నెల 27వ తేదీన ఈ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

లవ్ స్టోరీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం ఎంతో వేడుకగా జరగనుంది.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇద్దరు చీఫ్ గెస్ట్ లు రానున్నారని సమాచారం.

"""/"/అందులో మెగాస్టార్ చిరంజీవి ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా రావడంతో నాగచైతన్య లవ్ స్టోరీకి మంచి బూస్ట్ వచ్చినట్లే అని అభిమానులు భావిస్తున్నారు.

అదేవిధంగా ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున కూడా ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నారు.ఏది ఏమైనా లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి.

మరి ఈ సినిమా ప్రేక్షకులు అనుకున్న అంచనాలను చేరుతుందా.లేదా.

అనే విషయం తెలియాలంటే 27వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ ఫైర్